ఏపీలో కొత్తగా 4,570 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 4,570 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30,022 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. చిత్తూరు, విశాఖపట్నంలో అత్యధికంగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఒకరు చనిపోయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 669 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 26,770 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి..

బడులు బంద్ పెట్టడం ఒక కుట్ర

బీచ్‎లో భార్యతో కలిసి బాలయ్య చక్కర్లు