కోస్గి, వెలుగు: లాక్డౌన్ను పక్కగా పాటించాలని అధికారులు ఎంత చెబుతున్నా కొందరు వినడం లేదు. బుధవారం కోస్గిపట్టణంలో నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న కిరాణా షాప్ యజమాని రవికి మండల స్పెషల్ ఆఫీసర్ కృష్ణమాచారి రూ. 5000 జరిమానా విధించారు.
కిరాణా దుకాణాదారులు సర్కారు సూచించిన సమయంలోనే తెరవాలని, షాప్ ముందు మార్కింగ్ తప్పనిసరి అన్నారు. వినియోగదారులు సామాజికదూరం పాటించేలా చూడాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.