రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో తనయ్‌‌‌‌‌‌‌‌కు 5 వికెట్లు

రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో తనయ్‌‌‌‌‌‌‌‌కు 5 వికెట్లు
  •     మేఘాలయ 304 ఆలౌట్‌‌‌‌‌‌‌‌
     

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాటర్లు నిరాశపర్చారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తనయ్‌‌‌‌‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌‌‌‌‌ (5/103), రోహిత్‌‌‌‌‌‌‌‌ రాయుడు (3/33) మెరవడంతో.. ఉప్పల్ స్టేడియంలో శనివారం మొదలైన మ్యాచ్‌‌లో మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 83 ఓవర్లలో 304 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ బిస్వా (64), ఆకాశ్‌‌‌‌‌‌‌‌ చౌదరి (50 నాటౌట్‌‌‌‌‌‌‌‌), సచ్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌ (46), డిప్పు సంగ్మా (42) రాణించారు. 

తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తొలి రోజు చివరకు  5 ఓవర్లలో 25 రన్స్‌‌‌‌‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయింది. తన్మయ్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ (1), రోహిత్‌‌‌‌‌‌‌‌ రాయుడు (0) ఫెయిలయ్యారు. రాహుల్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (9 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ (10 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. చెంగ్‌‌కం సంగ్మా 2 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి స్కోరుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఇంకా 279 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనుకంజలో ఉంది.