
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 535 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 116, పౌరసరఫరాల శాఖకు చెందినవి 88, విద్యుత్ శాఖకు చెందినవి 62, హౌసింగ్సంబంధించినవి 57, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 36, ఇతర శాఖలకు చెందినవి 176 ఉన్నాయి. నోడల్ఆఫీసర్దివ్య దేవరాజన్ పర్యవేక్షణలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.
ఆస్తి కోసం తమ పెద్ద కొడుకు మర్రి రాములు తన భార్య తరఫు బంధువులతో కలిసి చిన్న కొడుకు శంకర్యాదవ్ను చంపేశాడంటూ యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన మర్రి ఈశ్వరమ్మ, ఇస్తారి దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శంకర్యాదవ్కు పెండ్లి కాలేదని, అతని వాటాను కొట్టేయాలనే దుర్బుద్ధితో రాములు తన బావ మరుదులు అవుశెట్టి గణేశ్, శ్రీశైలంతో కలిసి చంపేశారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మూడేండ్లుగా కేసు నమోదు చేయడం లేదని, రాములు లంచాలు ఇచ్చి మేనేజ్చేస్తున్నాడని వాపోయారు.