ఎర్రగడ్డ హాస్పిటల్లో కరోనా కలకలం

ఎర్రగడ్డ హాస్పిటల్లో కరోనా కలకలం

హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 57 మంది పేషెంట్లకు కొవిడ్ సోకింది. వీరితో పాటు 9 మంది వైద్య సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. లక్షణాలు ఉన్న వారందరికీ ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ చెప్పారు.