ఈత సరదా..ఆరుగురి మృతి

ఈత సరదా..ఆరుగురి మృతి

ఈత సరదా ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. హోలీ ఆడి స్నానాలు చేసేందుకు నదిలోకి దిగిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ముగ్గురిని వెలికితీశారు. మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అధికారులు.ఒడిశాలోని జైపూర్ ఖరస్రోత నదిలో ఈత కొడుతుండగా బాలురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నదిలో కొట్టుకుపోతున్న ముగ్గురి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. చీకటి పడటం వెలుతురు సరిగ్గా లేకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిలపివేశారు. రెండో రోజు గల్లంతైన ముగ్గురి కోసం ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్సన్ ఫోర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం

బ్రిటీష్​ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలి

జీవితాల్లోకి తొంగిచూస్తున్న స్మార్ట్ డివైజ్​లు