ఫ్లైఓవర్ పై నుంచి నదిలో పడ్డ మినీ ట్రక్కు..ఏడుగురు మృతి

ఫ్లైఓవర్ పై నుంచి నదిలో పడ్డ మినీ ట్రక్కు..ఏడుగురు మృతి

మహారాష్ట్రలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధులేలోని వించూర్ సమీపంలో  ఓ మినీ ట్రక్కు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో  పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు  మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పడ్డ మృతదేహాలను వెలికితీసి గాయపడ్డ వారిని హస్పిటల్ కు తరలించారు.