ఎన్నికల భారతం : ఇండియా ఓటర్లు 96 కోట్ల మంది..

ఎన్నికల భారతం : ఇండియా ఓటర్లు 96 కోట్ల మంది..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలో ఈ సారి ఓటర్ల సంఖ్య 96 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని తెలిపింది.  2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 5 కోట్ల ఓట్లు పెరిగినట్లు చెప్పింది. మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు  ఉన్నవారేనని తెలిపింది. అలాగే మొత్తం ఓటర్లలో  దివ్యాంగులు 18లక్షల మంది ఉన్నట్లు చెప్పింది.

 దేశంలోమొత్తం  ఎన్ని ఓట్లంటే?

  • మొత్తం ఒటర్ల సంఖ్య: 96 కోట్లు
  • మహిళా ఓటర్లు: 47 కోట్లు
  • 18-19 ఏళ్ల  వయసు వాళ్లు: 1.73 కోట్లు
  • పోలింగ్ కేంద్రాలు: 12 లక్షలు
  • పోలింగ్ సిబ్బంది: 1.5 కోట్ల మంది 
  • దివ్యాంగుల ఓట్లు: 18 లక్షల మంది
  • 1951లో ఓటర్లు: 17.32 కోట్ల మంది
  • 1957లో ఓటర్లు: 19.37 కోట్ల మంది
  • 2019లో ఓటర్లు: 91.02 కోట్ల మంది
  • తొలి లోక్ సభలో : 45  శాతం పోలింగ్
  • 2019 లోక్ సభ ఎన్నికల్లో: 67 శాతం