మ్యాన్ హోల్ సిమెంట్ రింగ్పై పడి బాలుడి మృతి

మ్యాన్ హోల్ సిమెంట్ రింగ్పై పడి బాలుడి మృతి

శంషాబాద్, వెలుగు: మ్యాన్ హోల్ సిమెంట్ రింగ్ మీద పడి బాలుడు చనిపోయిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సులేమాన్ నగర్ బస్తీకి చెందిన నిస్సార్ అహ్మద్ ఆటో డ్రైవర్. అతడికి ఆరుగురు పిల్లలు.  చిన్న కుమారుడు అబ్దుల్ రెహ్మన్ (4) గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. పక్కింటి గోడకు ఆనుకుని ఉన్న మ్యాన్ హోల్ సిమెంట్ రింగ్ జారి బాలుడి​పై పడింది. తలపై గాయాలు కావడంతో రెహ్మన్ అక్కడిక్కడే మృతి చెందాడు. కొన్నిరోజులుగా సిమెంట్ రింగ్ అక్కడే ఉందని, బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెహ్మన్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు ఫైల్ చేశారు.