- ఇద్దరికి గాయాలు
- రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘటన
గండిపేట, వెలుగు : ఓవర్ స్పీడ్తో వచ్చిన ఓ కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పీడీపీ చౌరస్తా నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న ఓ కారు ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చింది. శివరాంపల్లిలోని పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నం. 263 వద్ద కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.