ఢిల్లీలో మరోసారి అలజడి: ఘర్షణల్లో కానిస్టేబుల్ మృతి

ఢిల్లీలో మరోసారి అలజడి: ఘర్షణల్లో కానిస్టేబుల్ మృతి

ఢిల్లీ: CAA అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని  ఢిల్లీలో మరోసారి అలజడి రేగింది. ఆదివారం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాల నిరసన కారులు ఇవాళ మరింత రెచ్చిపోయారు. వ్యతిరేక, అనుకూల నినాదాలతో హోరెత్తిస్తూ.. దుకాణాలు, ఆటోలకు నిప్పంటించారు.

ఈ ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీకి చేరుకోనుండడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.