దేవుడి దయ ఉంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుంది

దేవుడి దయ ఉంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి డబుల్ బెడ్రూం ఇళ్లు. ఈ ఇళ్ళను దశల వారీగా లబ్దిదారులకు ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావని స్పష్టం చేశారు. కడుతున్న ఇళ్లు తక్కువని.. ఆ ఇళ్లను కూడా లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. దేవుడి దయ ఉంటేనే ఇల్లు వస్తుందని అన్నారు.

దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా లక్షలాది ఇళ్లను కట్టి ఇవ్వలేదని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రతి ఏటా కొన్ని ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. దేవుడి దయ ఉంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు వస్తుందన్నారు. దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలని… అదృష్టం ఉంటే ఒక ఏడాదిలోనే ఇల్లు రావచ్చని చెప్పారు. పదేళ్లకో, 15 ఏళ్లకో అందరికీ ఇళ్లు వస్తాయని అన్నారు మంత్రి.