Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010

Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010

సాధారణంగా రోజు మన చుట్టూ చాలా స్కామ్ లు జరుగుతూనే ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకోము. కానీ, ఒక్కసారి దాను గురించి తెలిసాక నోరెళ్లబెడతాం. అలా ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్ లు చాలానే జరిగాయి. ఇప్పుడు అలాంటి కథలని తెరపైకి తీసుకువస్తున్నారు మేకర్స్. అలా వచ్చిందే స్కామ్ 1992. హన్సల్‌ మెహతా నిర్మించిన ఈ సిరీస్ 2020లో సోనీ లివ్ లో విడుదలై ఘనవిజయం సాధించింది. భారత స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్‌ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్‌ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అనూహ్య విజయాన్ని సాధించింది. 

ఆ తరువాత స్కామ్ 2003 సిరీస్ తెరపైకి వచ్చింది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథ ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మరో స్కామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు హన్సల్‌ మెహతా. అదే స్కామ్ 2010. సుబ్రతా రాయ్ సహారా స్కామ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. 

కేవలం రూ. 2000 తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అనంతరం ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైలు కి పంపారు. తల్లి అంత్యక్రియల కోసం 2016లో బెయిల్ పై బయటకు వచ్చిన సుబ్రతా రాయ్.. ఇటీవలే గుండెపోటుతో మరణించాడు.