పార్క్ చేసి ఉన్న కారులో నుంచి మంటలు 

పార్క్ చేసి ఉన్న కారులో నుంచి మంటలు 

హైదరాబాద్ : ఇటీవల కారులో మంటలు రావడం వంటి ఘటనలు తరుచుగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువ. ఖరీదైన కారు అయిన సరే ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా చందానగర్ లో ఆగి ఉన్న కారు లో మంటలు చెలరేగాయి. చందానగర్ మున్సిపల్ అఫిస్ వద్ద పార్క్ చేసి ఉన్న టాటా ఇండిగో కారులో ఉన్నట్టుండి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలను ఆర్పేందుకు కొందరు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. 

సవాలక్ష కారణాలు..

కారులో ఇలా మంటలు రావాడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో సర్వీసింగ్‌ చేయకుండానే వేల కిలోమీటర్లు నడపడం కూడా ఇటువంటి ఘటనలకు దారితీస్తాయి. అంతేకాకుండా కార్ల  టైర్లు సరిగ్గా లేకపోవడం, అరిగిపోయిన టైర్లతో ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు  టైర్లకు రోడ్డుకు మధ్య స్కార్క్స్‌ ఏర్పడి కూడా మంటలు వ్యాపించడానికి అవకాశం ఉంది.  ఇక వాహనాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్​, ఫోమ్, ఎలక్ట్రికల్​ వైరింగ్​, ఫాబ్రిక్​ కారణంగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ డ్రైవ్ కు వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు అన్ని చెక్ చేసుకుని వెళ్లడం మంచిందని సూచిస్తు్న్నారు నిపుణలు.