ఓ మోటార్ బైక్ ఇంజన్లో నాలుగు అడుగుల నాగు పాము నక్కింది. అది తెలియని ఆ బండి యజమాని దానిపై దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. గుమ్మడిదలకు చెందిన భాస్కర్ బైక్ పై పొలానికి వెళ్లాడు. అక్కడి నుంచి విత్తనాల కోసం కో అపరేటివ్ సొసైటీకి వచ్చి బండిని పక్కన పార్క్ చేశాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు బైకు ఇంజన్కు చుట్టుకుని ఉన్న పామును గుర్తించారు. భాస్కర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. బైక్లో నక్కిన పామును తీయడానికి రెండు గంటల సేపు కష్టపడ్డారు. చివరికి దానిని చంపేశారు. – సంగారెడ్డి (గుమ్మడిదల), వెలుగు