‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కమిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ

‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కమిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ

హైదరాబాద్ : దిశ ఎన్ కౌంటర్ కేసు కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ రాష్ర్ట ప్రభుత్వం తన వాదనలను హైకోర్టులో వినిపించనుంది. ఎన్ కౌంటర్ కు గురైన వారి కుటుంబ సభ్యుల తరపు వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల తరపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వేల్ వాదనలు వినిపించారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ర్టక్షన్ పేరుతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని కోర్టులో తెలిపారు.