మియాపూర్​లో దారుణం.. వదినపై కత్తితో దాడి

మియాపూర్​లో దారుణం.. వదినపై కత్తితో దాడి

వదినపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ మరిది. ఈ దారుణ ఘటన మియాపూర్​పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్​ ఆఫీజ్​పేట్ లో నివసిస్తున్న మహానంది మదీనాగూడ లో ఓ స్కూల్​లో ఆయాగా పని చేస్తోంది. 

ఆమె డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చెల్లెలు భర్త ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రురాలిని హాస్పిటల్​కి తరలించారు. 

బాధితురాలి భర్త చంద్రకాంత్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే దాడికి కారణంగా ప్రాథమికంగా గుర్తించారు.