వదినపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ మరిది. ఈ దారుణ ఘటన మియాపూర్పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ ఆఫీజ్పేట్ లో నివసిస్తున్న మహానంది మదీనాగూడ లో ఓ స్కూల్లో ఆయాగా పని చేస్తోంది.
ఆమె డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చెల్లెలు భర్త ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రురాలిని హాస్పిటల్కి తరలించారు.
బాధితురాలి భర్త చంద్రకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే దాడికి కారణంగా ప్రాథమికంగా గుర్తించారు.