- ఇవాళ పోచారం, రేపు బండ్లగూడలో లక్కీ డ్రా
హైదరాబాద్ పోచారంలో రాజీవ్ స్వగృహ ప్లాట్లకు సంబంధించిన లక్కీ డ్రా కొనసాగుతోంది. పోచారంలో 14 వందల 70 ఫ్లాట్ల కోసం 5 వేల 921 దరఖాస్తులు వచ్చాయి. రేపు బండ్లగూడలోని ఫ్లాట్లకు డ్రా తీయనున్నారు. బండ్లగూడలోని 2 వేల 246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33 వేల 161 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ ప్రక్రియను ఫేస్ బుక్, యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ తో ప్రసారం చేస్తున్నారు. లక్కీ డ్రా లో వచ్చిన వారి పేర్లు, ఇతర వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ (HMDA) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు అధికారులు.