సదువు సున్న.. . భిక్షాటన చేస్తూ కోట్లు సంపాదించిండు

సదువు సున్న..  . భిక్షాటన చేస్తూ కోట్లు సంపాదించిండు

అడుక్కున్న డబ్బుతో కోటీశ్వరుడయ్యాడు బిహార్‌లోని పాట్నాకు చెందిన ఒక బిచ్చగాడు. భిక్షాటనతో సంపాదించిన డబ్బుతో చాలా చోట్ల భూములు కొన్నాడు. ఇతని ఇద్దరు పిల్లలు .. ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నారు. అయినా ఇప్పటికీ భిక్షాటన కొనసాగిస్తున్నాడు.

తనకు చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి లేదని.. . సరిగా చదువుకోలేదని కుటుంబ సభ్యులు తనని కొట్టేవారని పప్పు  తెలిపాడు. దీంతో కోపం వచ్చి ముంబై వెళ్లానని... అక్కడ రైల్వే స్టేషన్‌లో నిలబడిన తనను చూసిన జనం బిచ్చగాడిగా భావించి డబ్బులు ఇవ్వడం ప్రారంభించారని చెప్పాడు. అలా రెండు గంటల్లోనే తనకు రూ.3 వేల 400 వచ్చాయని చెప్పుకొచ్చాడు.. అలా మరుసటి రోజు అదే చోటికి వెళ్లి కూర్చున్నానని మళ్లీ డబ్బుులు రావడం మొదలయ్యాయని  దీంతో బిక్షాటన అలవాటుగా మారిందన్నాడు పప్పు. 

తనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలు ఉన్నాయని పప్పు చెప్పాడు.   తన భార్యకు ఐసీసీఐ, కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్నాయని చెప్పాడు. డబ్బులే కాకుండా నగరంలో చాలా చోట్ల భూములు ఉన్నాయని కుటుంబం మొత్తం ఉండటానికి ఖరీదైన  బంగ్లా కూడా ఉందని తెలిపాడు. తాను అడుక్కున్న డబ్బుతోనే ఇదంతా కొన్నానని చెప్పుకొచ్చాడు.   

ఇక తనకు  ఇద్దరు పిల్లలు ఉన్నారని..  వారిని  పాట్నాలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలిపాడు. తాను చదువుకోకపోయినా.. తన పిల్లలు జీవితంలో మంచి స్థానాలకు చేరుకోవాలని వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించానన్నాడు.  . అడుక్కున్న డబ్బుతో తన పిల్లలను ఆఫీసర్లుగా తీర్చిదిద్దుతానని చెబుతున్నాడు. తాను రోజుకు రూ.4000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని . నేను నెలవారీ ఆదాయాన్ని బ్యాంక్ ఖాతాలో జమచేస్తానని వెల్లడించాడు.