ఓల్డ్ సిటీ స్ట్రీట్‌ ఫైట్‌ లో గాయపడ్డ యువకుడు మృతి

ఓల్డ్ సిటీ స్ట్రీట్‌ ఫైట్‌ లో గాయపడ్డ యువకుడు మృతి

హైదరాబాద్ : నిన్న ఓల్డ్ సిటీలోని డబీర్ పురాలో జరిగిన స్ట్రీట్ ఫైట్ లో తీవ్రంగా గాయపడిన అద్నాన్ అనే యువకుడు ఇవాళ చనిపోయాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయడని.. మరో యువకుడికి సీరియస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఐదేండ్ల క్రితం మీర్‌‌చౌక్‌లో జరిగిన తరహాలోనే ఆదివారం రాత్రి ఓల్డ్ సిటీలో మరో గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ మధ్య తలెత్తిన చిన్న వివాదం గొడవకు దారితీసిందని తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో పోలీసులు మాట్లాడుతూ..  డబీర్ పురా పీఎస్ పరిధిలోని ఫర్హత్ నగర్ లో ఉండే అద్నాస్(19) ఆదివారం రాత్రి చంచల్ గూడలోని బంధువుల ఇంటికి వెళ్లాడని.. రాత్రి 11.30 గంటలకు అదే ఏరియాలోని తన ఫ్రెండ్స్ అబ్బాస్, ఫైజర్, అబ్దుల్లా, కమ్రాన్, ముజీబ్, నబీబ్ తో కలిసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. అబ్బాస్, అబ్దుల్లా ఇద్దరూ ఘర్షణకు  దిగారు.

దీంతో ఏడుగురు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.  ఫ్రెండ్స్ కు  నచ్చజెప్పేందుకు యత్నించగా అద్నాస్‌పై కమ్రాన్ దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు అద్నాస్ ను కాచిగూడ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అద్నాన్ మంగళవారం ఉదయం చనిపోయాడు. అద్నాస్ పై దాడి చేసిన కమ్రాన్ తో పాటు రెండు గ్రూపులకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుని తెలిపారు డబీర్ పురా పోలీసులు. కేసు ఫైల్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.