కుప్పకూలిన ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్

కుప్పకూలిన ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్

మహారాష్ట్రలో పెను ప్రమాదం తప్పింది. పూణే జిల్లాలోని కడ్బన్వాడీ గ్రామంలోని ఓ పొలంలో  ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 22 ఏళ్ల ట్రైనీ పైలెట్ భావికా రాథోడ్ గాయపడ్డారు. ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఉదయం 11.30 గంటల సమయంలో ట్రైనీ పైలెట్ ఎయిర్ క్రాఫ్ట్ను నడుపుతుండగా అదుపుతప్పి కూలిపోయింది. ఈ ఘటనలో రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.