ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు

ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు
  • ఐదుగురు మృతి ఒడిశాలో ప్రమాదం

కియోంఝర్: ఒడిశాలోని కియోంఝర్​జిల్లాలో బుధవారం ఉదయం పెండ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకుపోయింది. దీంతో ఐదుగురు మృతిచెందగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నేషనల్​ హైవే నంబర్​ 20 సాతింఝర్​ సాహి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో వరుడు మేనల్లుడుతోపాటు వధువు తరఫున బంధువులు ముగ్గురు ఉన్నారు. ఈమేరకు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఇన్​స్పెక్టర్ ​సునీల్​ కార్​ వెల్లడించారు. ట్రక్కు వేగంగా దూసుకురావడంతో స్పాట్​లోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని సీఐ తెలిపారు. 

డీజే మ్యూజిక్, డ్యాన్స్ లతో పెండ్లి ఊరేగింపు మాన్​పూర్​ గ్రామం నుంచి బయలుదేరింది. పెండ్లి కూతురు ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో బార్రాటిస్​వద్ద యాక్సిడెంట్​ జరిగిందని పోలీసులు వివరించారు. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రిలో  చేర్పించామని, వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉండటంతో కటక్​ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్​ను అరెస్టు చేసి, ట్రక్కును సీజ్​ చేశామని చెప్పారు.