నడిరోడ్డుపై ప్రసవం..!

నడిరోడ్డుపై ప్రసవం..!

మక్తల్ టౌన్, వెలుగు: నారాయణ పేట జిల్లామక్తల్ పట్టణంలో నడి రోడ్డుపై ఓ మహిళ ప్రసవించింది. మక్తల్ పట్టణంలోని బీసీ కాలనీలో ఉంటున్న మహేశ్వరికి గురువారం ఉదయం 9 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు సొంత ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ‌మధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. మహేశ్వరి తనకు ఆటోలో ఇబ్బందిగా ఉందని అనడంతో కిందకు దింపారు. కొన్ని క్షణాల్లోనే రోడ్డుపై మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడే ఉన్న మున్సిపాలిటీ మహిళా కార్మికులు, రోడ్డున వెళ్లే మహిళలు దుప్పట్లు, చీరలు అడ్డం పట్టుకొని కుటుంబీకులకు సాయం చేశారు. అనంతరం తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం