మాదాపుర్ ఓయో రూమ్లో యువతి అనుమానాస్పద మృతి

మాదాపుర్ ఓయో రూమ్లో యువతి అనుమానాస్పద మృతి

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  పాండిచ్చేరికు చెందిన ప్రియా(25),చెన్నైకు చెందిన శ్రీహరి(26) 2023 అక్టోబర్ 10న హైదరాబాద్ కు వచ్చారు. మాదాపుర్ చంద్రనాయాక్ తాండలోని ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు.  గత రాత్రి ఇద్దరు మద్యం సేవించారు. అయితే శ్రీహరికి పుడ్ పాయిజన్ కావడంతో ఈ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి  ప్రియా కూర్చున్న  కుర్చీలోనే మృతి చెందింది. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  సంఘటనా స్థలానికి చేరకున్న  పోలీసులు  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.  

 ALSO READ : పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు