తిరుమల కిషోర్ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. శర్వా సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చాలా కామెడీగా ఉంది. శర్వానంద్ నిరుత్సాహానికి గురైన వ్యక్తిగా ఉంటాడు, అతను పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్నాడు కానీ అతని చుట్టూ ఉన్న స్త్రీలు మ్యాచ్లను చెడగొట్టారు. ఒకరోజు రష్మిక మందన్న అతని జీవితంలోకి ప్రవేశించింది, అయితే ఆమె తల్లి కొన్ని షరతులు పెట్టింది. ఇద్దరి మధ్యన వచ్చే సీన్స్ బాగున్నాయంటున్నారు ఫ్యాన్స్. నిరాశపరిచిన యువకుడి పాత్రలో శర్వా ఆకట్టుకుంటున్నాడు. రష్మిక మందన్న తన లేడీ లవ్గా ఆకట్టుకుంది. లేడీ గ్యాంగ్ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించింది. రాధికా శరత్కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మార్చి-4న రిలీజ్ కానున్న ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ రిలీజ్ ను ట్విట్టర్ లో సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్న రష్మిక వీడియోను పోస్ట్ చేసింది. ప్రేక్షకులారా రండి మీ దీవెనలు అందించండి. అంటూ తెలుగులో ట్వీట్ చేసింది.
ప్రేక్షకులారా రండి మీ దీవెనలు అందించండి ?❤️
— Rashmika Mandanna (@iamRashmika) February 27, 2022
Here's the Trailer of #AadavalluMeekuJohaarlu.
▶️ https://t.co/BQlXW0Mn5i
IN THEATRES FROM MARCH 4th ❤️#AMJTrailer #AMJOnMarch4th @ImSharwanand @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/mNfQFFUk8H