పోలీసులపై చర్యలు తీసుకోండి : ఏబీవీపీ నేతలు

పోలీసులపై చర్యలు తీసుకోండి : ఏబీవీపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ భూ ముల కోసం నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమి ళిసైని ఏబీవీపీ నేతలు కోరారు. శనివారం ఈ మేరకు రాజ్ భవన్​లో గవర్నర్​ను స్టేట్ సెక్రటరీ ఝాన్సీ, స్టేట్ జాయింట్ సెక్రటరీలు శ్రీనాథ్, పృథ్వీరాజ్, కల్యాణిలు కలిసి వినతి పత్రం అందజేశారు. జీవో 55ను రద్దు చేయాలని చేపట్టిన నిరసనను అడ్డుకునే క్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని లేడీ కానిస్టేబుల్స్ స్కూటీతో వెంబడించి జుట్టు పట్టుకోవడంతో ఆమె గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు.