- హర్ష ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పరిధిలోని కొంపల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడు కన్నుమూశాడు. స్థానికుల సమచారం మేరకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన ఈ యువ వైద్యుడు తుదిశ్వాస విడిచాడు. అతని వద్ద లభించిన ఐడీ కార్డుల ఆధారంగా హర్ష ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ గా గుర్తించారు. యువ వైద్యుడే రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఉదంతం స్థానికంగా విషాదం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
అకస్మాత్తుగా అడ్డొచ్చిన గేదెను ఢీకొని కిందపడి.. లారీ చక్రాల కింద నలిగి..
కొంపల్లి హర్ష ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ శుక్రవారం విధులు ముగించుకుని తన ఇంటికి వెళ్తుండగా కొంపల్లి ఫ్లైఓవర్ పై అకస్మాత్తుగా గేదె అడ్డురావడంతో గేదెను ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెల్తున్న లారీ చక్రాల కింద పడిన రమేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డా రమేష్ మృతి చెందాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.