V6 News

పిల్లలు లేరని చిన్నారి కిడ్నాప్.. 24గంటల్లో నిందితుడి రిమాండ్​

పిల్లలు లేరని చిన్నారి కిడ్నాప్.. 24గంటల్లో నిందితుడి రిమాండ్​
  • పోలీస్ ​స్టేషన్​లో ​ కంప్లైంట్​ చేసిన బాధిత కుటుంబం

కంది, వెలుగు :  అనారోగ్య కారణంగా హాస్పిటల్​కు  తీసుకొచ్చిన ఓ చిన్నారిని కిడ్నాప్​ చేసిన నిందితున్ని సంగారెడ్డి టౌన్​ పోలీసులు శనివారం అరెస్టు చేసి, రిమాండ్​తరలించారు.  సంగారెడ్డి టౌన్​  పోలీస్​స్టేషన్​లో డీఎస్పీ రమేశ్​కుమార్​ వివరాలు వెల్లడించారు..  మెదక్ ​జిల్లా తూప్రాన్​ మండలానికి చెందిన వోల్లేపు రాజు అనారోగ్యంతో   గవర్నమెంట్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ కోసం శుక్రవారం తన భార్యాపిల్లలను తీసుకుని సంగారెడ్డికి వచ్చారు.  హాస్పిటల్​కు రావడం లేట్ కావడంతో డాక్టర్లు అందుబాటులో లేక ఆ రోజు రాత్రి సంగారెడ్డిలోని గంజ్​మైదాన్​లో గద్దెపై భార్యా పిల్లలతో కలిసి నిద్రపోయారు.  

దీన్ని చూసిన పట్టణానికి చెందిన మన్నె అనిల్​ అనే వ్యక్తి తన ఫ్రెండ్​ శ్రీశైలంతో కలిసి వారి చిన్న కూతురు రూపను కిడ్నాప్​ చేశాడు.  ఈ విషయమై రాజు సంగారెడ్డి టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. టౌన్​ సీఐ శ్రీధర్​రెడ్డి మూడు టీమ్​లను రంగంలోని దింపి, సీసీ పుటేజీ ఆధారంగా  అనిల్​ను అరెస్టు చేసి, రిమాండ్​ తరలించారు. మరో నిందితుడు శ్రీశైలం పరారీలో ఉన్నాడు.  పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన టౌన్​ సీఐ శ్రీధర్​రెడ్డితో పాటు క్రైమ్ టీం, పెట్రోల్​ మొబైల్​ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  కాగా, అనిల్​దంపతులకు పెళ్లై ఏండ్లు గడిచినా పిల్లలు కాకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకున్నారు. వోల్లేపు రాజు  దంపతులు పిల్లలతో కలిసి నిద్రించడాన్ని గమనించి, ఆ పాపను పెంచుకోవడానికి కిడ్నాప్​ప్లాన్​ వేసి జైలు పాలయ్యాడు.