గుడిహత్నూర్‌ పీఎస్‌లో పిల్లల పార్క్‌ ప్రారంభించిన ఎస్పీ

గుడిహత్నూర్‌ పీఎస్‌లో పిల్లల పార్క్‌ ప్రారంభించిన ఎస్పీ

గుడిహత్నూర్, వెలుగు: పిల్లలకు చదువుతోపాటు ఆటలు ముఖ్యమేనని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌తో కలిసి మంగళవారం గుడిహత్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో చిల్డ్రన్స్​ పార్క్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎదిగే పిల్లలు తమ శారీరక సామర్థ్యాల పెంచుకునేందుకు ప్రతి పోలీస్​స్టేషన్‌లో చిల్డ్రన్​పార్క్​ను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని పిల్లలు ఉపయోగించుకోవాలని అన్నారు. 

ఈ సందర్భంగా పార్కులో ఆడుకోవడానికి వచ్చిన పిల్లలతో కలిసి ఎస్పీ సందడి చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌ లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేసారు. ఇచ్చోడ సీఐ బండారి రాజు, పీఎస్‌ఐ మధుకృష్ణ,  సిబ్బంది పాల్గొన్నారు.