
మేజర్, హిట్ 2 చిత్రాలతో కిందటేడాది వరుస విజయాలను అందుకున్న అడివి శేష్.. ఇప్పుడు ‘గూఢచారి’ సీక్వెల్ కోసం రెడీ అవుతున్నాడు. ‘జి2’ టైటిల్తో రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ మూవీ నుంచి సోమవారం ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ గన్తో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్ సరికొత్తగా మేకోవర్ అయినట్టు అర్ధమవుతుంది. దీంతోపాటు ప్రీ విజన్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో శేష్ను ఇండియా నుండి ఆల్ఫ్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారిగా చూపించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించిన టీమ్..దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టు చెప్పింది. ఈ చిత్రానికి శేష్ కథను అందించగా.. ‘మేజర్’ మూవీ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.