రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా

రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ పై  రేపు మరోసారి రాజాసింగ్ తరపు న్యాయవాది రామచందర్ వాదనలు వినిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన 10 సంవత్సరాలలో అనేక మందిపై నమోదైన పీడీ యాక్ట్ కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ పై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను రామచందర్ హైకోర్టు ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. రామచందర్ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

మరోవైపు రాజాసింగ్ దాఖలు చేసిన పీడీ యాక్ట్ పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో దాదాపు రెండు నెలలుగా రాజాసింగ్ జైలులోనే ఉన్నారు. ఇక రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించింది.