గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్

గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ(ఎంజేపీటీబీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ), ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ వెలువడింది.  అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 12వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 28న జరగనుంది.

కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ, బీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీటీ, బీబీఏ, బీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 2023–-24 విద్యా సంవత్సరం ఇంటర్​ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. 

సెలెక్షన్​: ప్రవేశ పరీక్ష మార్కులు, రూల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  ఏప్రిల్​ 12 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష  ఏప్రిల్​ 28న నిర్వహిస్తారు. వివరాలకు www.tswreis.ac.in వెబ్​సైట్​లో సంప్రదించవచ్చు.