హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టుల్లో రివర్సబుల్ పంపింగ్తో అదనపు జలవిద్యుత్ ను ఉత్పత్తి చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యుత్సౌధలో జెండా ఎగరేసిన ఆయన మాట్లాడుతూ మూడేండ్లలో రివర్సబుల్ పంపింగ్తో ‘శ్రీశైలం’ నుంచి 518 మిలియన్ యూనిట్లు, ‘సాగర్’ ద్వారా 162 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశామన్నారు.
గ్లోబల్ వార్మింగ్తో 2030 నాటికి ప్రజారవాణా రంగంలో 100 శాతం , వ్యక్తిగత రవాణా రంగంలో 40శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయన్నారు. దీంతో ఆటో మొబైల్ ఇండస్ట్రీకి వెహికల్స్చార్జింగ్ స్టేషన్ల అవసరం ఏర్పడుతుందని, వీటికి అనుగుణంగా బల్క్ పవర్ అందించేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.