V6 News

బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటే: జైరాం రమేశ్​

బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటే: జైరాం రమేశ్​

హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని ఏఐసీసీ జనర ల్ సెక్రటరీ  జై రాం రమేశ్​ అన్నారు. ప్రధాని స్పీచ్​తో అది అర్థమైపోయిం దన్నారు. బీఆర్ఎస్​అత్యంత అవినీతి పార్టీ అని మోదీ కామెంట్​ చేశారని, దాన్ని బట్టే ఆ పార్టీలు ఒక్కటే అని చెప్పొచ్చని శని వారం ట్వీట్​చేశారు. గతంలో మేఘాలయ పర్యటనలో హోం మంత్రి అమిత్​షా కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర సీఎం సంగ్మాతో జట్టు కట్టారన్నారు.

అమిత్​షా చేసిన ఆరోపణలకు సంబంధించి సీఎం సంగ్మాను విచారించాల్సిందిగా సీబీఐకి ఈ ఏడాది మార్చి 21న  లేఖ రాసినట్టు తెలిపారు.  ఎన్సీపీ అంటనే నేచురల్లీ కరప్ట్​పార్టీ అంటూ మోదీ ఆరోపణలు గుప్పించారని ట్వీట్​లో జైరాం రమేశ్​ పేర్కొన్నారు.