భలే స్కెచ్ : కేజీ బంగారంతో దొరికిన ఎయిర్ హోస్టస్

భలే స్కెచ్ : కేజీ బంగారంతో దొరికిన ఎయిర్ హోస్టస్

తన ప్రైవేట్ పార్ట్ లో దాచిపెట్టి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ హోస్టస్ పట్టుబడింది. మే 31వ తేదీ శుక్రవారం కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడిన ఎయిర్ హోస్టెస్‌ను అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తెలిపింది. సురభి ఖతున్ అనే ఎయిర్ హోస్టెస్ తన ప్రైవేట్ పార్ట్ లో  దాదాపు 960 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Also read : ఢిల్లీ... శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

నిందితురాలైన ఎయిర్ హోస్టెస్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పని చేస్తుంది. మే 28 న మస్కట్ నుండి కన్నూర్‌లో ల్యాండ్ అయిన విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడింది.  కన్నూర్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సురభి ఖతున్‌ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా, సురభి ఖాతున్ గతంలో కూడా చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందని సమాచారం.