రాబోయే ఎన్నికలతో బీజేపీ చాప్టర్ క్లోజ్: అఖిలేశ్ యాదవ్

రాబోయే ఎన్నికలతో బీజేపీ చాప్టర్ క్లోజ్: అఖిలేశ్ యాదవ్

లక్నో: రాష్ట్రంలో బీజేపీ చాప్టర్ క్లోజ్ కానుందని సమాజ్​వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదన్నారు. ఓడిపోతామని తెలిసి పోటీ చేసేందుకు క్యాండిడేట్లు ముందుకురావట్లేదని చెప్పారు. 90% మంది ప్రజలు, దళితులు, మైనార్టీలు పీడీఏ(పిచ్డే, దళిత్, అల్పసంఖ్యాక్) బీజేపీని ఓడించేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

 ఈ విషయాలన్నీ ఓ సర్వేలో తేలాయని ఆదివారం మీడియాకు వెల్లడించారు. పీడీఏ తరఫున పోరాటం చేస్తున్నది సమాజ్​వాదీ పార్టీనే అని అన్నారు. తప్పుడు వాగ్దానాల కారణంగా రైతులు బీజేపీపై తిరగబడతారన్నారు. ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న యువత కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్నారు. మహిళా రెజ్లర్ల దుస్థితి, మణిపూర్ అల్లర్ల వంటి ఘటనలపై బీజేపీ విధానాలను చూసిన మహిళలెవరూ ఆ పార్టీకి ఓటేయరని చెప్పారు.