చేతులెత్తి మొక్కుతా బయటకు రాకండి: మంత్రి వేముల

చేతులెత్తి మొక్కుతా బయటకు రాకండి: మంత్రి వేముల

‘మీ బిడ్డగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఇండ్ల నుంచి బయటకు రాకండి. కరోనా కట్టడికి అందరూ సహకరించండి’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం బాల్కొండ, భీమ్ గల్ పట్టణాల్లో మంత్రి పర్యటించారు. అనంతరం వేల్పూర్ లోని తన నివాసంలో ఆఫీసర్లు, ప్రజాప్రతి నిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. కరోనాని వారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉన్న వారు ఇంటి నుంచి బయటకు రావొద్దని, వారికి నిత్యావసర సరుకులు ఆఫీసర్లు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారని ఆయన చెప్పారు.

నియోజక వర్గంలో పాజిటివ్ కేసులు..

బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో ఇద్దరికి, భీమ్‌‌గల్ పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని హైదరాబాద్‌‌కు తరలించామని మంత్రి తెలిపారు. బాల్కొండలో కరోనా సోకిన ఇద్దరు మరో 25 మందిని కలిశారన్నారు. భీమ్‌‌గల్‌‌లోని వ్యక్తి సుమారు 53 మందిని కలిసినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో వారు ఉండే ఏరియాల్లో ప్రత్యేక చర్యలు తీసకుంటున్నామన్నారు. వాటిని కంటైన్మెంట్ కస్ల్టర్లుగా ప్రకటించామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.

1167 మంది హోంక్వారంటైన్లో..

బాల్కొండ నియోజకవ ర్గంలో 1167 మంది హోం క్వారంటైన్‌‌లోఉన్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో ని మర్కజ్‌కు వెళ్లిన వారితో కరోనా ఇక్కడి వారికి సోకుతోందన్నారు. వ్యాధి నివారణ కోసం 24 గంటలు కష్టపడుతున్న ఆఫీసర్లు, సిబ్బందిని ఆయన అభినందించారు. వేల్పూర్‌‌‌‌ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలోనిర్వహించిన సమావేశంలో కరోనా కట్టికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మంత్రి వెంట జిల్లా వైద్యాధికారి రమేశ్, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్‌‌‌‌ కమిష‌‌నర్‌‌‌‌ గంగాధర్‌‌, ఏసీపీ రఘు, సీఐ సైదయ్య, స్థానిక ఆఫీసర్లు, నాయకులు ఉన్నారు.