ప్రతి శనివారం నో స్కూలు బ్యాగ్ డే

ప్రతి శనివారం నో స్కూలు బ్యాగ్ డే

స్కూలు విద్యార్థుల విషయంలో మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 8వతరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం వేగంగా మారుతుందని, అందుకే పాఠశాల విద్యార్థులకు కొంత స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రతీ శనివారం పాఠశాలకు విద్యార్థులు స్కూలు బ్యాగ్ లేకుండానే పాఠశాలకు వెళ్తారన్నారు సీఎం బీరేన్ సింగ్.