Allu Arjun-NTR: రిషబ్‌ శెట్టికి జాతీయ అవార్డు..అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభినందనలు

Allu Arjun-NTR: రిషబ్‌ శెట్టికి జాతీయ అవార్డు..అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభినందనలు

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (70th National Awards 2024) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్ట్ 16న) ప్రకటించిన విషయం తెలిసిందే. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌‌‌‌లో ఉత్తమ నటుడిగా కన్నడ హీరో  ‌‌‌‌రిషబ్‌‌‌‌ శెట్టి ఎంపికయ్యారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ ‘కార్తికేయ2' నిలిచింది. 

దీంతో రిషబ్ శెట్టికి, హీరో నిఖిల్ మరియు కార్తికేయ2 మేకర్స్ కి పలు భాషల సినిమా స్టార్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. 

‘జాతీయ అవార్డు విజేతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు అని పోస్ట్ చేయగా..ఈ పోస్ట్‌కు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) రిప్లై ఇస్తూ..‘థాంక్యూ బ్రదర్‌’ అని కామెంట్ చేశారు.అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్‌ ఉత్తమ నటిగా అవార్డు పొందడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. 

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ2’ మూవీ సాధించినందుకు ఆ టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు’. నిఖిల్‌, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు అని వెల్లడించారు. అయితే, 2021కు గాను పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు సాధించిన విషయం తెలిసిందే.

అలాగే ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్న రిషబ్ శెట్టికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ X లో పోస్ట్ చేస్తూ.."రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు. ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న నీకు ఆ అవార్డు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాంతార చిత్రంలో నీ పెర్ఫామెన్స్ కి ఇప్పటికి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి" అంటూ అదే విధంగా బెస్ట్ పాపులర్ ఫిలిం గా నిలిచినా కాంతార చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ పై ఎంతో అభిమానం ఉన్న సంగతి తెలిసిందే.