సెకెండ్ వేవ్ తర్వాత చిన్న సినిమాలతో స్టార్టయిన షూటింగ్ సందడి ఇప్పుడు పెద్ద సినిమాల వరకు వచ్చింది. స్టార్ హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్కి వెళ్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ షూటింగ్ కూడా నిన్న సికింద్రాబాద్లో రీస్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్కి సంబంధించిన బ్యాలెన్స్ షూట్ని ఈసారి బ్రేక్ లేకుండా ఫినిష్ చేయాలనుకుంటున్నారు. దీని కోసం నలభై ఐదు రోజుల పాటు షూట్ చేయాల్సి ఉందని మేకర్స్ చెప్పారు. ప్రస్తుతం బన్నీ, విలన్గా నటిస్తున్న ఫహాద్ల మధ్య యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఆగస్టు నెలాఖరు లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అంటే.. ముందుగా అనౌన్స్ చేసినట్టు ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి దసరా రేస్లో నిలిపే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందాన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయాల్సి ఉంది. త్వరలో
మురుగదాస్ డైరెక్షన్లో నటిస్తాడనే టాక్ కూడా వినిపిస్తోంది.