కర్ణాటక: హూబ్లీ రైల్వే స్టేషన్లోని అమరావతి ఎక్స్ ప్రెస్ రైలులో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమరావతి నుంచి వచ్చిన రైలు చివరి స్టేషన్ అయిన హూబ్లీలో ఆగింది. హుస్సేన్ అనే వ్యక్తి చేతిలో ఉన్న డబ్బాలో పేలుడు జరిగిందని చెప్పారు. దీంతో అతనికి గాయాలయ్యాయని తెలిపారు… ప్రస్తుతం అతన్ని కిమ్స్ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. పేలుడు దాటికి స్టేషన్ లోని అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు స్టేషన్ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకుని చెక్ చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Hubli: A box exploded at Hubli Railway Station, today. One person injured, and has been admitted to hospital. Police and Railway Protection Force are at the spot. #Karnataka pic.twitter.com/DtjykGbhJm
— ANI (@ANI) October 21, 2019