
మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రవర్తన విచిత్రంగా ఉందని అన్నారు. ఎక్కడా ప్రతిపక్షంలోకి వెళ్ళవలసి వస్తుందనే భయంతోనే., ఈవిఎంలపై బూటకపు అనుమానాలను వెళ్లగక్కారన్నారు. తాను గెలవడం కోసం ప్రజాస్వామ్యాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు
ఆదివారం జరిగిన APPSC పరీక్షా పత్రంలో ఎన్నికల నియమావళికి విరుద్దంగా టిడీపీ కి అనుబంధ ప్రశ్నలను అడగడం దారుణమన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీడీపీ గురించే కాకుండా చంద్రబాబు కుటుంబం గురించి కూడా అడిగితే బాగుండేదేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం APPSC తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.