
బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి అని పాడుకున్నట్టు.. అమెరికా యుద్ధవిమానాలతో క్యూ కట్టేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 52 అధునాతన ఎఫ్35ఏ యుద్ధ విమానాలతో అమెరికన్ ఎయిర్ఫోర్స్ ఎక్సర్సైజులు చేసింది. ఇరాన్ టెన్షన్ నేపథ్యంలోనే సోమవారం యుటా బేస్లో ఈ భారీ ఎక్సర్ సైజ్ నిర్వహించింది. 1979లో అమెరికాకు చెందిన 52 మంది దౌత్యవేత్తలు, పౌరులను ఇరాన్ బందీలుగా ఉంచుకుంది. తాజాగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే 52 టార్గెట్లను నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించడం.. 52 జెట్లతో ఎక్సర్సైజ్ చేయడం వార్నింగేనంటున్నారు.