అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారు

అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రి దగ్గర భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.  నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు రజాకార్లు. అందుకే మర్రి చెట్టు దగ్గర సభను ప్లాన్ చేస్తున్నారు. అమిత్ షా పర్యటన రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు బండి సంజయ్.