
హైదరాబాద్, వెలుగు: అమ్మమ్మాస్ బ్రాండ్ పేరుతో ఈజీ టు కుక్ ప్రొడక్టులను అందిస్తున్న మంగమ్మ ఫుడ్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతోంది. వచ్చే నెలలోపు ఎనిమిది ఔట్లెట్లను ప్రారంభిస్తోంది. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్లో ఇటువంటి కేంద్రాలు రెండు ఉన్నాయి. 2023 చివరినాటికి 100 స్టోర్ల స్థాయికి చేరుస్తామని మంగమ్మ ఫుడ్స్ కో–ఫౌండర్ ప్రతిమా విశ్వనాథ్ తెలిపారు. ‘పచ్చళ్లు, తృణధాన్యాలు, స్వీట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి 100 రకాల ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నాం. 10 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మూడవ ఏడాది సందర్భంగా యాప్ ద్వారా జరిపే కొనుగోళ్ళకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం. అన్ని ఔట్లెట్లనూ కంపెనీ సొంతంగా స్థాపిస్తోంది. ఫ్రాంచైజీ విధానానికి కూడా సిద్ధమే! స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసి స్థల యజమానికి కమీషన్ ఇస్తాం. అమ్మకాల్లో ఆన్లైన్ వాటా 10 శాతం ఉంది. ఈ ఏడాది బెంగళూరు, పుణే నగరాల్లో అడుగుపెడతాం. విస్తరణకు నిధులు సమీకరిస్తాం’ అని ఆమె వివరించారు.