బెస్ట్100 ఫుడ్ బ్రాండ్లలో..అమూల్,మదర్ డెయిరీ టాప్

బెస్ట్100 ఫుడ్ బ్రాండ్లలో..అమూల్,మదర్ డెయిరీ టాప్

భారతదేశంలోని ఫుడ్ బ్రాండ్లలో అమూల్ ,మదర్ డెయిరీ అగ్రస్థానంలో నిలిచాయి. 35వేల కోట్ల బ్రాండ్ విలువతో అమూల్ భారతదేశపు అగ్రశ్రేణి ఆహార బ్రాండ్‌గా నిలిచింది. 9,831 కోట్ల బ్రాండ్​ విలువతో మదర్ డెయిరీ రెండో స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్ (Brand Finance) నివేదిక 2025 ప్రకారం ఈ విషయం వెల్లడైంది. 

ALSO READ | కాస్మిక్స్ బ్రాండ్ ..నెలకు రూ.6 కోట్ల ఆదాయం

ఈ రెండు బ్రాండ్లు పాడి ఉత్పత్తుల రంగంలో వినియోగదారులలో బలమైన ఉనికిని,నమ్మకాన్ని కలిగి ఉన్నాయి. అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైతుల యాజమాన్యంలోని పాల సహకార సంస్థ. ఇది 3.6 మిలియన్ల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. మదర్ డెయిరీ కూడా తన ఉత్పత్తుల నాణ్యతకు ,విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌కు ప్రసిద్ధి చెందింది.

బ్రాండ్​ ఫైనాన్స్​జాబితాలో బ్రిటానియా (Britannia) మూడవ స్థానంలో, నందిని (Nandini) నాలుగవ స్థానంలో, డాబర్ (Dabur) ఐదవ స్థానంలో ఉన్నాయి.అమూల్,మదర్ డెయిరీ దేశంలో వినియోగదారుల నమ్మకాన్ని, విస్తృత పరిధిని ఎంతగానో పెంపొందించుకున్నాయని స్పష్టం చేస్తుంది.

2024-25లో  మదర్ డెయిరీ దాదాపు రూ. 17వేల500 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 16 శాతం వృద్ధిని సాధించింది.నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన మదర్ డైరీ..ఆపరేషన్ ఫ్లడ్ అనే నవల కార్యక్రమం కింద స్థాపించారు.  ఇది మదర్ డైరీ  బ్రాండ్ కింద పాలు ,పాల ఉత్పత్తులను తయారి, మార్కెటింగ్ చేస్తుంది.