షాద్నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆయనకు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు కన్హా శాంతి వనంలో తిరిగి, బయోచార్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను పరిశీలించారు. అనంతరం దాజీ.. కన్హా శాంతి వనంలో నెలకొన్న ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణను వివరించారు.
