ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇక నుంచి టిఫిన్ కూడా..

ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇక నుంచి టిఫిన్ కూడా..

హైదరాబాద్ నగరంలో కేవలం రూ.5 కే భోజనం పెడుతూ పేదల కడుపు నింపుతున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు మార్చేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాలకు ఇందిర క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

భోజన కేంద్రాలలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా భోజన కేంద్రాలకు పర్మనెంట్ ప్లేస్, నిర్మాణాల పునరుద్ధరణ కు కమిటీ ఆమోదం తెలిపింది.

ఇక నగరంలో ఉన్న టాయిలెట్లను  పే అండ్ యూజ్ పద్ధతిలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. 

ALSO READ | బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్