8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఒక కేంద్రమంత్రికీ గవర్నర్ పోస్ట్

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఒక కేంద్రమంత్రికీ గవర్నర్ పోస్ట్
  • 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. కేంద్రమంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి ఇచ్చారు. ఆయనను కర్నాటక గవర్నర్ గా నియమించారు. అలాగే ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను... హర్యానాకు పంపించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా మంగుభాయ్ చంగన్ భాయ్ పటేల్,  త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్,  గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లై, జార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బైస్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు.