జీడిమెట్ల, వెలుగు: డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్లోని ఫేజ్–2 శ్రీరాంనగర్కు చెందిన జి. శివకిరణ్(31) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది.
సోమవారం రాత్రి ఫతేనగర్లోని అత్తగారింటికి వెళ్లిన శివకిరణ్ భార్యను తన వెంట రమ్మన్నాడు. 3 నెలల తర్వాత వస్తానని ఆమె చెప్పింది. దీంతో శివకిరణ్ భార్యతో గొడవపడ్డాడు. కోపంలో తన ఇంటికి వచ్చి ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.