భార్యతో గొడవ.. భర్త సూసైడ్.. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఘటన

భార్యతో గొడవ.. భర్త సూసైడ్.. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఘటన

జీడిమెట్ల, వెలుగు: డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్​లోని ఫేజ్​–2 శ్రీరాంనగర్​కు చెందిన జి. శివకిరణ్​(31) డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతడి భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది.

సోమవారం రాత్రి ఫతేనగర్​లోని అత్తగారింటికి వెళ్లిన శివకిరణ్ భార్యను తన వెంట రమ్మన్నాడు. 3 నెలల తర్వాత వస్తానని ఆమె చెప్పింది. దీంతో శివకిరణ్ భార్యతో గొడవపడ్డాడు. కోపంలో తన ఇంటికి వచ్చి ఫ్యాన్​కు చీరతో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.